29.7 C
Hyderabad
May 3, 2024 04: 20 AM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ తో రఘురాముడి భేటీ

#MP Raghuramakrishnam Raju

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై కొద్ది కాలంగా బహిరంగంగా విమర్శిస్తున్న పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు ఏకంగా రాష్ట్ర పతిని కలవడం ఆసక్తి కలిగిస్తున్నది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చిన తర్వాత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డాను మరి కొంత మంది ప్రముఖులను కలిసిన రఘురామకృష్ణంరాజు నేడు రాష్ట్రపతిని కూడా కలిశారు.

నర్సాపూర్ పార్లమెంటు పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్ లలో కేసులు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో రక్షణ కల్పించాలని రఘురామకృష్ణంరాజు కేంద్రాన్ని కోరారు. త్వరలో కేంద్రం తన బలగాలతో రఘురామకృష్ణంరాజు కు రక్షణ కల్పించబోతున్నది.

Related posts

విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేసిన ‘ఉప్పెన‌లోని జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు’

Satyam NEWS

రైల్వే కోడూరు వైసీపీ లో భగ్గు మన్న నిరసన

Satyam NEWS

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి

Satyam NEWS

Leave a Comment