మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి, భారతి అవినాష్ రెడ్డిలకు వివేకానంద రెడ్డి హత్య చేస్తున్న సమాచారం ముందే తెలుసన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కూడా బాబాయి హత్యలో అవినాష్ రెడ్టికి మద్దతు ఇస్తున్నారనేది అర్థం అవుతోందని తెలిపారు. చేసిన తప్పులను అవినాష్ రెడ్టి ఒప్పుకుని సరెండర్ అవ్వాలని డిమాండ్ చేశారు. జగన్హన్ రెడ్డికి కూడా హత్య జరిగిన వెంటనే సమాచారం అందిందన్నారు.
అజయ్ కల్లాం కూడా తెల్లవారుజామున జగన్ చెప్పిన విషయాన్ని వెల్లడించారని ఆయన తెలిపారు. ముందుగా జగన్కు హత్య చేస్తారని తెలిసే ఉదయం ఆ నలుగురితో సమావేశం పెట్టారన్నారు. వివేకానంద రెడ్డి హత్యలో దోషులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతికి తెలిసే హత్య జరిగిందన్నారు. వాళ్లకు శిక్ష పడే వరకు వివేకానంద రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి, బీజేపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయనేది అపోహ మాత్రమే అని తేల్చిచెప్పారు. జగన్ మాటల గారడీతో రాష్ట్రం సర్వ నాశనం అయ్యిందని మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తిని ఎవరూ వెనుకేసుకురారన్నారు. అవినాష్ రెడ్టి ఈరోజు విచారణకు హాజరవుతానని చెప్పారని.. ఇప్పుడు తల్లికి అనారోగ్యం పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు.