ముగ్గురు యువకుల వేధింపులు ఒక అమ్యాయి ఉసురు తీశాయి. వారికి బుద్ధి రావడానికా అన్నట్లు ఆ అమ్మాయి వారితో వాట్సప్ లో ఛాటింగ్ చేస్తూనే ఊరివేసుకున్నది. అత్యంత దారుణమైన ఈ ఘటన నెల్లూరు నగరంలోని భక్తవత్సల నగర్ లో జరిగింది. రమ్య అనే విద్యార్థిని ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది.
ఉరేసుకునే ఫొటోలను చిత్రీకరించి ఛాటింగ్ చేస్తూ ముగ్గురు యువకులకు రమ్య వాటిని వాట్సాప్ లో పంపింది. ముగ్గురు యువకుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని రమ్య కుటుంబ సభ్యులు అంటున్నారు.
రమ్య నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నది. రమ్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.