కడపజిల్లా బద్వేల్ పట్టణంలో విద్యార్థిని అదృశ్యం అయిన సంఘటన సంచలనం కలిగిస్తున్నది. మూడు రోజులు గడచినా విద్యార్థిని ఆచూకీ దొరకలేదు. బద్వేల్ పట్టణంలోని గోపిరెడ్డి స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న వెంకట సంజన శుక్రవారం మధ్యాహ్నం స్కూల్ నుండి బయటకు వచ్చింది. వెంకట సంజన ఇంటికి చేరలేదు. దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బద్వేల్ అర్బన్ పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.