29.7 C
Hyderabad
May 2, 2024 06: 49 AM
Slider హైదరాబాద్

జగన్ గురూజీకి విరాళం అందించిన గ్లాండ్ ఫార్మా కంపెనీ

jagan Gurujee

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లాక్ డౌన్ వల్ల అనేక ప్రాంతాల్లో ఆహారం అందని వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శ్రీ మాత యోగ అన్నపూర్ణేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.

జగన్ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలకు నేడు గ్లాండ్ ఫార్మా కంపెనీ యాజమాన్యం అండగా నిలిచింది. ట్రస్ట్ నిర్వాహకులు జగన్ గురూజీ ని కలిసి వారు లక్షా ముప్పై ఐదు వేల రూపాయల చెక్ ను తమ వంతు సహాయం గా అందజేశారు.

దీంతో ట్రస్ట్, కంపెనీ సంయుక్తంగా ఆహారం అందని అనేక మందికి నాణ్యమైన భోజనాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో  గ్లాండ్ ఫార్మా కంపనీ ఎండీ అండ్ సిఈఓ శ్రీనివాస్ సాధు, కంపనీ సీఎస్ఆర్  రఘు రామన్, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, కంపెనీ సీఎస్ సంపత్ కుమార్ లు పాల్గొన్నారు.

Related posts

రామతీర్థం నీలాచలం కేసులో ముగ్గురి అరెస్టు

Satyam NEWS

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నుంచి రాంచందర్ కి డాక్టరేట్

Bhavani

టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ డైరీ ఆవిష్కరించిన కెప్టెన్ ఉత్తమ్

Satyam NEWS

Leave a Comment