పత్రికలు ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో యూనియన్ 2023 డైరీ ని కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పత్రికలు పాటుపడాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడు పత్రికలు ప్రజలను చైతన్యవంతం చేసి, ప్రజాస్వామ్యం యొక్క విలువలు చాటి చెప్పాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలోను, తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువచ్చింది పత్రికలేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలకి, ప్రజలకు వారధిగా ఉండి సమస్యల పరిష్కారంలో కృషి చేయాలి కోరారు.
పత్రికలు నిస్వార్ధంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మునగడ ఉంటుందని,తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పత్రికలు నిస్వార్ధంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డైరీ ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. యూనియన్ జాతీయ,రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.యూనియన్ కు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్,జర్నలిస్టులు దాచేపల్లి దయాకర్ రెడ్డి,బసవోజు శ్రీనివాస చారి,పెందుర్తి భాస్కర్,ఆర్పి గౌడ్,దేవరం వెంకటరెడ్డి,కొమర్రాజు అంజయ్య,ఇట్టి మల్ల రామకృష్ణ,ఇందిరాల రామకృష్ణ,టీ వీ ఎల్, దేనమకొండ శేషం రాజు,దేవరం రామిరెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాసు,రమేష్ బాబు,బాచిమంచి చంద్రశేఖర్, ఈడుపుగంటి సుబ్బారావు,తన్నీరు మల్లికార్జున రావు,మంజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్