ఒక దేశ వారసత్వాన్ని, విజ్ఞాన సంప్రదాయాలను, విలువలను పెంపొందించడంలో సాంస్కృతిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి సంస్థలలో మ్యూజియంలు ఆడియో-విజువల్ మార్గాల ద్వారా దేశ సుసంపన్న వారసత్వాన్ని సంరక్షించీ, డాక్యుమెంట్ రూపం లో భద్ర పరచి ప్రదర్శించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి.
అవి వ్యక్తులు, కమ్యూనిటీల మధ్య సంభాషణలను కూడా సులభతరం చేస్తాయి. ఇది నేటి విభిన్న సాంస్కృతిక విధానాలతో నిమగ్నం కావడానికి దోహదపడుతుంది. ఈ సందర్భంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2022 ఫిబ్రవరి 15-16 తేదీలలో “హైదరాబాద్ లో భారతదేశంలో మ్యూజియంలను తిరిగి ఊహించడం” పై మొట్టమొదటి గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.
ఈ సదస్సు మన మ్యూజియంల నిర్వహణ, అభివృద్ధి గురించి చర్చించడానికి భాగస్వాములందరికి అపారమైన అవకాశాలను కల్పించనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభమవుతాయి.