సూర్యాపేట జిల్లా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ కన్వీనర్ గా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన రాయప్రోలు శ్రీ రామయ్య శర్మ ను నియమిస్తున్నట్లు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొట్రా సతీష్ శర్మ తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ రామయ్య శర్మ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంబొట్ల ఫణికుమార్ శర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.బ్రాహ్మణ సోదర, సోదరీమణుల సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్