స్కూళ్లను మూసివేసే జీఓ 117 ను రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ తెలుగునాడు విద్యార్థి విభాగం నేడు పల్నాడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా తెలుగునాడు విద్యార్థి విభాగం నరసరావుపేట నియోజకవర్గం అధ్యక్షులు ఎనుగంటి భార్గవ్ సాయి మాట్లాడుతూ జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఎందరో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని అన్నారు.
రాష్ట్రం లో విద్యా వ్యవస్థ ను నిర్వీర్యం చేస్తున్నారని మండి పడ్డారు.తక్షణమే ఈ జీఓ ను రద్దు చేయాలని లేని పక్షంలో రానున్న రోజుల్లో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం TNSF అధ్యక్షులు ఎనుగంటి భార్గవ్ సాయి , పల్నాడు జిల్లా TNSF కార్యనిర్వహక కార్యదర్శి అల్లూరి సుధాకర్ బాబు , TNSF నాయకులు కరిముల్లా , నితీష్ , హరిక్రిష్ణ , భాషా , తదితరులు పాల్గొన్నారు.