36.2 C
Hyderabad
May 8, 2024 18: 02 PM
ఖమ్మం

పాలేరు జలాశయాన్ని గోదారి నీటితో నింపుతాం

puvvada

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాల అభివృద్ధి సంస్థ, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్  యాదవ్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ నేడు రోయ్య పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ పాలేరు రిజర్వాయర్ వ్యవసాయ రంగానికే కాకుండా మత్స్యకారుల అభివృద్ధి కి కూడా ఉపయోగపడేలా చేస్తున్నామని చెప్పారు.

రాబోయే రోజుల్లో పాలేరు జలాశయాన్ని గోదావరి నీటితో నింపుతామన్నారు. కులవృత్తులు దేదీప్యమానంగా వెలుగొందేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేప పిల్లలు గొర్రె పిల్లలు, గేదలు లాంటి పథకాలను ప్రవేశపెట్టి  కులవృత్తులను గౌరవిస్తోందని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. అన్ని రకాల కుల వృత్తుల వారు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు.

తెలంగాణ వచ్చాక మత్స్యకారులకు  అన్నిరకాలుగా ప్రయోజనం జరిగిందని, మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుగు నింపారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్యకారులకు  పూర్తిస్థాయిలో అన్ని రకాలుగా 100 శాతం సబ్సిడీ అందించడంతో పాటు, వారికి కావలసిన అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పధకాలు వారి జీవితాల్లోకి వెలుగును తెచ్చిందని అన్నారు.

ముఖ్యంగా వారికి కావలసినటువంటి మోపెడ్ లు, వలలు, వాహనాలు, చేప పిల్లలు, ఐస్ బాక్సులు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని, ఖమ్మం జిల్లాలో 707 చెరువులలో 2.50 కోట్ల రూపాయల ఖర్చుతో 318 లక్షల చేప పిల్లలు 100 శాతం రాయితీతో ఇచ్చామని అన్నారు. వకాశాలను కల్పించారన్నారు. మత్స్య సంపదను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందాన్ని వ్యక్తం అవుతుంది అని, పాలేరు రిజర్వాయర్ మంచినీటి చేపల పెంపకంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు.

ఇక్కడ సుమారు 13 వందల మంది మత్స్యకారులు 18 గ్రామాల నుండి పాలేరు రిజర్వాయర్లో చేపల వేటపై ఆధారపడి ఉన్నారు. కాబట్టి పాలేరు రిజర్వాయర్ కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఒక ఫిష్ మార్కెట్ మార్కెట్ చేస్తే హైవే రోడ్ లో  ఏర్పాటు చేస్తే చేపల వేట పై అదారపడ్డ మత్స్యకారులకు జీవనోపాధి తో పాటు ఆర్థికంగా బలపడ్డుతారని అభిప్రాయ పడ్డారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మోటార్ వెహికల్స్ మత్స్యకారులకు అవసరమైన పరికరాలతో పాటు చేప పిల్లలు రొయ్య పిల్లలను అందిస్తుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Related posts

ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్ గా విష్ణు ఎస్.వారియర్ రిపోర్ట్

Satyam NEWS

లకారం కు అదనపు సొగబులు అద్దుతున్నాం

Satyam NEWS

ఈ నెల 20 నుండి 22 వరకు తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్టివల్

Murali Krishna

Leave a Comment