దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబాన్ని గాడ్సే వారసులు చేతిలో అధికారం పెట్టుకుని ఈడీ కేసులతో వేధిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. ఆజాద్ కా గౌరవ యాత్ర లో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గంలోని పంతిని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది .
ఈ సందర్భంగా పిసిసి కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వాళ్లకు కొమ్ము కాసి దేశ సార్వభౌమత్వానికి నష్టం చేస్తున్నారని ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ జన సంఘ్ ను నిషేధిస్తే అందులో నుండి పుట్టిన పార్టీనే ఈనాటి బిజెపి అన్న సంగతి గుర్తుంచుకోండి.
వాజ్ పేయి వీరసావార్క్ బ్రిటిషర్ల నుండి క్షమాభిక్ష కోరి కొవర్టులుగా బ్రిటిషర్ల దగ్గర పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. స్వతంత్ర ఉద్యమంలో ఏనాడు పాల్గొనని వారు నేడు దేశాన్ని పాలిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం అనేక పబ్లిక్ రంగ సంస్థలను నెలకొల్పితే వాటిని తెగ నమ్ముతున్న చరిత్ర బీజేపీ ది.
ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంక్ లను జాతీయం చేస్తే ,నేడు ప్రధాని మోడీ బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేసి బ్యాంకులను విలీనం చేయడం సిగ్గుచేటు. 25 లక్షల కోట్లు ముంచిన బడా బాబుల కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం వారి నుండి ఎందుకు రికవరీ చేయట్లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒప్పుకోమన్న ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడిచే బిజెపి నాయకులు ఈరోజు వాట్సాప్ లో డీపీలు మార్చమంటే గత చరిత్ర కనుమరుగు అవుతుందా అని అడుగుతున్నాం. వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ నమీండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తుందని అన్నారు.
రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడిచెర్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బుచ్చిరెడ్డి ,యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్, శ్రీనివాస్, రాజు ,రహీం ,సునీల్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.