38.2 C
Hyderabad
May 5, 2024 20: 40 PM
Slider ఖమ్మం

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

#nama

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ధర్మల్ పవర్ స్టేషన్ లో  జరిగిన ప్రమాద  ఘటనపై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఫోన్ లో  సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన కేటీపీఎస్ కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని నామ అధికారులను కోరారు.కేటీపీఎస్ లో మెయింటినెన్స్ పనులు రిపేర్లు చేస్తుండగా ప్రమాదం జరిగి, ముగ్గురు కార్మికులు గాయపడిన సంగతి తెలిసిందే.విషయం తెలియగానే  నామ వెంటనే అధికారులతో పాటు  స్థానిక పార్టీ  నాయకులతో కూడా  మాట్లాడి, క్షతగాత్రులకు అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలని, దగ్గరుండి , చికిత్సకు సహకరించాలని నామ కోరారు. క్షతగాత్రులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందిస్తున్నట్లు ఈ సందర్భంగా  కేటీపీఎస్ అధికారులు నామకు వివరించారు.

Related posts

దళిత సంక్షేమానికి నిధుల కోత పెట్టిన మోడీ ప్రభుత్వం

Satyam NEWS

క‌రోనాతో పోరాడి ఓడిన సర్కిల్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

బియ్యం చుట్టూ తిరుగుతున్న కారు కమలం కయ్యం

Satyam NEWS

Leave a Comment