భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ధర్మల్ పవర్ స్టేషన్ లో జరిగిన ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఫోన్ లో సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన కేటీపీఎస్ కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని నామ అధికారులను కోరారు.కేటీపీఎస్ లో మెయింటినెన్స్ పనులు రిపేర్లు చేస్తుండగా ప్రమాదం జరిగి, ముగ్గురు కార్మికులు గాయపడిన సంగతి తెలిసిందే.విషయం తెలియగానే నామ వెంటనే అధికారులతో పాటు స్థానిక పార్టీ నాయకులతో కూడా మాట్లాడి, క్షతగాత్రులకు అన్ని విధాలా అండగా ఉండి ఆదుకోవాలని, దగ్గరుండి , చికిత్సకు సహకరించాలని నామ కోరారు. క్షతగాత్రులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చికిత్స అందిస్తున్నట్లు ఈ సందర్భంగా కేటీపీఎస్ అధికారులు నామకు వివరించారు.
previous post