33.7 C
Hyderabad
April 28, 2024 23: 22 PM
Slider పశ్చిమగోదావరి

కబడ్డీలో ద్వితీయ స్థానంలో నిలిచిన గోపన్నపాలెం మహిళా జట్టు

#westgodavari

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో డాక్టర్  గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతరాష్ట్ర మహిళా కబడ్డీ ఆటల పోటీలలో దెందులూరు మండల పరిధిలో ఉన్న శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల మహిళా జట్టు ప్రత్యర్థి జట్టుతో హోరా హోరీగా తలపడి ద్వితీయ స్తానం సంపాదించింది. రాష్ట్ర స్థాయిలో గోపన్నపాలెం సీతారామ వ్యాయా మ కళాశాల ప్రతిష్ట నిలబెట్టారని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డైరెక్టర్ కళాశాల ప్రిన్సిపాల్ సలీంభాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విజయం కళాశాల యాజమాన్యం మొత్తనికి గర్వకారణమని పిన్సిపాల్ సలీంభాషా పేర్కొన్నారు. ఈ పోటీలలో కళాశాల నుండి పాల్గొన్న భవాని, ప్రశాంతి, రంగీలా, కె సంధ్య, ఎం సంధ్య, లక్ష్మీ సౌందర్య, శాంతమ్మ, వీర మణి, లలిత, శిరీష, సరస్వతి, శిరీష పాల్గొన్నారు. వీరిని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డైరెక్టర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ కె సలీంభాషా, డాక్టర్ పి వి కె డి ప్రసాద్, అధ్యాపకులు జయలక్ష్మి, రమేష్ లు అభినందించారు.

Related posts

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ఫ్ఫ్యాప్టో సమాయత్తం

Satyam NEWS

పిచ్చికుక్కల దాడిలో చావుబతుకుల్లో బాలుడు

Satyam NEWS

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి: వసంత నాగేశ్వరరావు

Satyam NEWS

Leave a Comment