27.7 C
Hyderabad
April 30, 2024 10: 16 AM
Slider విశాఖపట్నం

మంత్రి పదవి ఇవ్వని సీఎం దిష్టి బొమ్మ దగ్ధం

#karanamdharmashree

మంత్రి పదవి ఇవ్వని ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం వైసీపీ నాయకులు తగులబెట్టారు. చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కి మంత్రి పదవి వస్తుందని ఆయన అనుచరులు భావించారు.

అయితే ఆయనకు జగన్ మొండి చెయ్యి చూపించారు. దాంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పర్యవసానంగా ధర్మశ్రీ అభిమానులు సీఎం దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు. చోడవరంలో మెయిన్ రోడ్డు జంక్షన్  లో ధర్మ శ్రీ అభిమానులు ఆందోళన కు దిగారు. కరణం ధర్మశ్రీ నూతన మంత్రి వర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చోడవరం  వైసిపి కార్యాలయం దగ్గరికి భారీగా చేరుకున్న ధర్మశ్రీ అభిమానులు సిఎం..డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Related posts

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున మెగా రక్తదాన శిబిరం

Satyam NEWS

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

Satyam NEWS

4039 కొనుగోలు కేంద్రాల్లో నిరంతరాయంగా ధాన్యం కొనుగోళ్లు

Satyam NEWS

Leave a Comment