రాబోయే జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతామని బిజేపి నాయకులు అన్నారు. ఈరోజు ఉదయం బీజేవైఎం రాష్ట్ర నాయకులు జి.అరుణ్ కుమార్ నాయకత్వంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హైదర్ నగర్ 123 డివిజన్ స్థానిక ఆదిత్య నగర్ కమిటీ హాల్ లో బిజెపి మీటింగ్ జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, గౌరవ అతిథులుగా జిల్లా అధ్యక్షులు పొన్నాల హరీష్ రెడ్డి, స్నేహశీలి అతిథులుగా యువ మోర్చా అధ్యక్షుడు బాను ప్రకాష్, విశిష్ట అతిథులుగా అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద, ప్రేమశీలి అతిథి నరేందర్ రెడ్డి హాజరయ్యారు.
డివిజన్ అధ్యక్షుడు నవీన్ గౌడ్ అధ్యక్షతన సాయి ప్రశాంత్ నగర్ చెందిన ఎస్.యం చారి, ఆధ్వర్యంలో 45 మంది, శ్రీరామ్ నగర్ చెందిన నరసింహ, మహేష్ ఆధ్వర్యంలో 60 మంది, కృష్ణవేణి కాలనీకి చెందిన వెంకట్ రజక ఆధ్వర్యంలో 30 మంది, ఆదిత్య నగర్ చెందిన సీనియర్ లీడర్ వేణు యాదవ్ ఆధ్వర్యంలో 40 మంది మహిళలు, యువకులు, సీనియర్ సిటిజెన్స్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు.
రాబోయే జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతామని హైదర్ నగర్ డివిజన్ కాషాయం జెండా ఎగిరే విధంగా పార్టీ కోసం పని చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి డివిజన్ సీనియర్ నాయకులు ఏం. కే దేవ్, వెలగ శ్రీనివాస్, ఎల్లేష్ ముదిరాజ్, బాలకృష్ణ రజక, మనోహర్ గౌడ్, నర్సింగ్, రామచంద్ర గుప్తా, స్వామి, శేఖర్, దశరథ్ రజక, చోటు, చంద్రశేఖర్ కార్యకర్తలు నాయకులు పాల్గొని జయప్రదం చేశారు.