తన ఫోన్ ను టాపింగ్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో తన పేరును లాగాలని చూస్తున్నారని ఆమె అన్నారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన తమిళసై కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫామ్ హౌస్ కేసులో పేరు ప్రస్తావనకు వచ్చిన తుషార్ గతంలో తన ఏడిసిగా పని చేశారని, అంత మాత్రాన తన పేరును కేసులోకి లాగుతారా అని ఆమె ప్రశ్నించారు.
తన ఫోన్ ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నట్లు నిర్ధారణ అవుతున్నదని ఆమె అన్నారు. ప్రగతి భవన్ లా కాకుండా ప్రజలకోసం రాజ్ భవన్ ద్వారాలు ఎప్పుడు తెరచి వుంటాయని ఆమె తెలిపారు. నేను గవర్నర్ నే కాదు.. ముందు అమ్మను, గైనకాలజిష్టుని. బాలికలు విద్యా సంస్థల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. పిల్లలను సవాళ్లు ఎదుర్కొనేలా సన్నద్ధం చేయాలి. బాలికలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. బాలికల్లో శారీరక, మానసిక మార్పులు సంభవిస్తుంటాయి. పిల్లల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది.. మన అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దకూడదని ఆమె ఈ సందర్భంగా అన్నారు. మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఎన్సీపీసీఆర్ ను అభినందిస్తున్నానని తెలిపారు.