మానవ హక్కుల సంఘం శ్రీకాకుళం జిల్లా నూతన అధ్యక్షునిగా డాక్టర్ గుండ బాల మోహన్ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు ఉంటారు. మానవ హక్కుల పై పూర్తిస్థాయిలో జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తానని ఈ సందర్భంగా బాలమోహన్ తెలిపారు.
ఎవరికైనా మానవ హక్కులకు భంగం కలిగినట్లయితే తమను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి జిల్లా మానవ హక్కుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు.
జిల్లాలో న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, టీచర్లు, ప్రొఫెసర్లు, విశ్రాంత ఉద్యోగస్తులు ఎవరైనా తమ మానవ హక్కుల కమిటీ లో పని చేయాలనుకుంటే తనకు సంప్రదించవలసినదిగా కోరారు. (ఫోన్ నెంబర్ :9492265697)