తెలంగాణ శాసన సభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం రద్దు అంశంపై అసెంబ్లీ, పార్లమెంట్ లలో ప్రస్తావిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు దళిత బంధు సక్రమంగా అమలు చేయాలి ఆయన డిమాండ్ చేశారు. అలాగే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలివ్వాలని అన్నారు. నిరుద్యోగ భృతికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిపై ఏపీ నిర్మిస్తున్న సంగమేశ్వర, పోతిరెడ్డిపాడులపై కేసీఆర్ పోరాటం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.