29.7 C
Hyderabad
April 29, 2024 10: 04 AM
Slider విజయనగరం

పాము కాటు చికిత్స పొందుతున్న విద్యార్ధులను పరామర్శించిన కలెక్టర్

#tirumalahospital

విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం నియోజకవర్గ మైన కురుపాం బీసీ హాస్టల్ లి పాము కాటుకు గురై విజయనగరం తిరుమల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మిగిలిన ఇద్దరు విద్యార్థులను జిల్లా కలెక్టర్ సూర్య కుమారి నిన్న రాత్రి పరామర్శించారు. ఉదయం నుంచీ కొత్త జిల్లా ఏర్పాటు లో భాగంగా పార్వతీ పురంలో పర్యటించిన కలెక్టర్ రాత్రి విజయనగరం వచ్చారు. వచ్చీ రాగానే నేరుగా తిరుమల హాస్పిటల్ కు వెళ్లారు. పాము కాటుకు గురై స్ధానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పరామర్శించారు.

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి వైద్యుల ద్వారా తెలుసుకున్నారు. కలెక్టర్ విద్యార్ధులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని కోరారు. విద్యార్థుల కన్నవాళ్లతో తో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి మాట్లాడారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారన్నారు. మెరుగైన వైద్య సహాయాన్ని అందిస్తున్నా మని ధైర్యం చెప్పిన కలెక్టర్ చెప్పారు.

Related posts

ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ రాబడి ఉన్న చర్చి ఏదో తెలుసా?

Satyam NEWS

ఓ రైతు, పాస్ బుక్ సమస్య, ఒక పెట్రోలు బాటిల్

Satyam NEWS

వసుధ వందనం

Satyam NEWS

Leave a Comment