కడప జిల్లా రాజంపేట లోని పులపుత్తూరు లో చెయ్యేరు వరద బాధితులను కాపాడిన చెన్న కేశవులు కుటుంబ సభ్యులకు రాజంపేట జూనియర్ యన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో 30 వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ యన్టీఆర్ యువసేన అధ్యక్షుడు శ్రీహారి నాయుడు,యన్టీఆర్ కేశవ,మధు,తేజ్ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి,హిమ చందు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘ అధ్యక్షుడు శ్రీవారి నాయుడు మాట్లాడుతూ తన వారితో పాటు సాటి వారిని కాపాడి వరద ప్రవాహం లో కొట్టుకుపోయిన కుటుంబానికి తన స్నేహితులు అండ దండలతో సహాయం చేశామని,ఇంకా వరదల్లో సర్వం కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని వారిని ఆదుకునేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారని,ఇంకా రావాలని ఆయన పిలుపునిచ్చారు.
previous post