39.2 C
Hyderabad
May 3, 2024 12: 17 PM
Slider నిజామాబాద్

ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా కుడుముల సత్యం ముదిరాజ్

kudumula satyam

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలు టీఆరెస్ పార్టీ ఏకగ్రీవమయ్యాయి. ఛైర్మన్ గా టీఆరెస్ అభ్యర్థి కుడుముల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ గా గండిమాసానిపేట్ 5 వ వార్డుకు చెందిన మహిళా అభ్యర్థి ముస్తాల సుజాత ఎన్నికయ్యారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో టీఆరెస్ అభ్యర్థులను గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేసిఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణాగా మారుతుందని, ఎల్లారెడ్డి మున్సిపాలిటీని అభివృద్ధి బాట పట్టిస్తామని, అన్ని సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దేవేందర్ రెడ్డి, కమిషనర్ రాజ్ వీర్, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్రం, రాష్ర్ట ప్ర‌భుత్వాలు దొందూ దొందే!

Sub Editor

వైఎస్ ఆర్ సి పి నాయకుని ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

పూజా ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

Bhavani

Leave a Comment