Slider విశాఖపట్నం

విశాఖలో నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం

nadendla manohar

మూడు రోజుల పర్యటన నిమిత్తం జనసేన పార్టీ నాయకులు, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్ననాదెండ్ల మనోహర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుకు చేరుకుని పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి సమావేశాలకు వేదిక అయిన నోవాటెల్ హోటల్ వరకు కార్లు, బైక్ లతో ర్యాలీగా ఆయనను అనుసరించారు.

నాదెండ్ల మనోహర్ కి స్వాగతం పలికిన వారిలో  జనసేన నాయకులు టి. శివశంకర్, కోన తాతారావు, సుందరపు విజయ్ కుమార్, గడసాల అప్పారావు, పరుచూరి భాస్కరరావు, డా. రఘు, ఉషాకిరణ్ , పి.వి.ఎస్.ఎన్ రాజు, కోత పూర్ణచంద్రరావు, శివ దత్, సతీశ్, శివతో పాటు పలువురు జనసేన నాయకులు, జన సైనికులు వీర మహిళలు ఉన్నారు.

అనంతరం నోవాటెల్ హోటల్ లో  విశాఖపట్నం జిల్లా జనసేన నాయకులతో నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరారు.   గూనూరు సూర్యనారాయణ, గూనురు మూలునాయుడు, సిరిపురపు రమేష్, వంతకు జగదీష్, సానబోయిన గోవింద్, కర్రి రమేష్ పార్టీలో చేరారు.  నాదెండ్ల మనోహర్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతా కలసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి  కృషి చేయాలని  ఈ సందర్భంగా మనోహర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Related posts

ములుగుకు ఈ నెల 28న రానున్న మంత్రి హరీశ్ రావు

Satyam NEWS

ఒకేరోజు 5.60 లక్షల మొక్కలు

Bhavani

టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది: నిఖిల్

Bhavani

Leave a Comment