39.2 C
Hyderabad
May 3, 2024 12: 40 PM
Slider సినిమా

జూనియర్ ఎన్టీఆర్ కు చెల్లి చేతిలో పరాభవం

junior NTR

యువ నేతల విందుకు తనను పిలవకపోవడంపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల వారసులతో నారా లోకేష్ నిన్న సమావేశం అయిన విషయం తెలిసిందే. టీడీపీ నేతల రాజకీయ వారసులతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం హైదరాబాద్‌లో విందు సమావేశం నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన వారసులను ఈ విందుకు ఆహ్వానించారు. వారసుల భార్య/భర్తలను సైతం పిలిచారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానం లేదు. దాంతో  నారా లోకేష్  పై  జూనియర్ ఎన్టీఆర్  అభిమానులు   కోపంతో రగిలిపోతున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగింది.

చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు సైతం కొద్దిసేపు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికి మాత్రమే ఆహ్వానం పంపామని లోకేష్ కార్యాలయం తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ విషయం పై వ్యాఖ్యానించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.

Related posts

లొల్లి

Satyam NEWS

తెలంగాణ ఎన్నికల అదనపు కమిషనర్‌గా లోకేష్ కుమార్

Bhavani

కరోనాతో ములుగులో హిందీ ఉపాధ్యాయుడు మృతి

Satyam NEWS

Leave a Comment