పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాడిన యోధుడు కన్నుమూశాడు. దళిత బహుజన, వామపక్ష పార్టీలకు నాయకత్వం వహించిన పోరాట యోధుడుగా పేరు పొందిన మల్కిపురం పూర్వ సర్పంచ్ భూపతి నారాయణ మూర్తి తన 99వ ఏట కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారు ఝామున తూర్పు గోదావరి జిల్లా మల్కి పురం సమీపం లోని భూపతి వారి పేట లో ఆయన తుది శ్వాస విడిచారు. లాల్ – నీల్ శక్తుల ఐక్యతా భావనను దశాబ్దాల క్రితమే ప్రతిపాదించిన క్రాంతదర్శీ, బహు గ్రంథకర్త, హేతువాది, మల్కిపురం పూర్వ సర్పంచ్ భూపతి నారాయణ మూర్తి. ఆయన మరణంతో ఆ ప్రాంతం అంతా శోక సముద్రంలో మునిగిపోయింది.
previous post