యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న గూడూరు టోల్ గేట్ ఎత్తివేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. హైదరాబాద్ నుండి 35 కిలోమీటర్ దూరంలో గూడూరు, 54 కిలోమీటర్ల దూరంలో జనగామ జిల్లాలోని రఘునాథపల్లి టోల్గేట్ ఉండడంతో రవాణా చార్జీలు ఎక్కువవుతున్నాయి. 60 కిలోమీటర్ల పరిధిలో ఒక టోల్గేట్ ఉండాలని నిర్వహించడంతో గూడూరు టోల్ గేట్ ఎత్తి వేయనున్నారు.
గూడూరు టోల్ గేట్ ఓ ప్రైవేటు ఏజెన్సీ 2012 నుండి 2033 సంవత్సరం వరకు అగ్రిమెంట్ ఉండగా గతంలో మరో ఐదేళ్ల వరకు అంటే 2038 పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రోజుకు 30 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్ గేట్ ఎత్తివేతతో ఉమ్మడి వరంగల్ , యాదాద్రి భువనగిరి జిల్లా, నల్లగొండ జిల్లా వాహనదారులకు లాభం కలగనుంది.