38.2 C
Hyderabad
May 5, 2024 23: 02 PM
Slider గుంటూరు

మ్యాచింగ్ సెంటర్ పేరుతో గుట్టుగా వ్యభిచార కేంద్రం

#GunturPolice

గుంటూరు లో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. జన్మతహ ముస్లిం అయిన ఒక మహిళ శ్రీను అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పేరును శ్రీ లక్ష్మీగా మార్చుకున్నది.

నిర్ణీత సమయానికి నివాస స్థలాలు మారుస్తూ చాలా కాలంగా వ్యభిచార గృహాలను ఆమె నిర్వహిస్తున్నది. ఎటి అగ్రహారం లో చీరలు జాకెట్లు అమ్మే షాపు పెట్టి, శ్రీ లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహాన్ని ఆమె నిర్వహిస్తున్నది.

ఎంతో మంది మహిళలను వలపన్ని తీసుకువచ్చి వారి ఆర్ధిక అవసరాలను తీరుస్తానని చెప్పేది. దాంతో వచ్చే మహిళలు వ్యభిచారానికి సిద్ధపడేవారు. మహిళల ఫొటోలను వాట్సాప్ ద్వారా విటులకు పంపి వారిని తన షాపు కు రప్పించేది.

అక్కడే వ్యభిచారం చేసేవారు. నిర్వాహకురాలు శ్రీలక్ష్మితో పాటు పేరం సుబ్బారెడ్డి,పట్టపురాజు శ్రీనివాసులు,పెద్దింటి రమేష్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదు వేల రూపాయల నగదు,మూడు సెల్ ఫోన్లు,రెండు బైక్లు సీజ్ చేశారు.

Related posts

రోగులకు మందులు ఇచ్చేందుకు చేతులు రావా?

Satyam NEWS

పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు కూడ శ్రద్ధ చూపాలి

Satyam NEWS

సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు

Satyam NEWS

Leave a Comment