డివిజన్ లోని సమస్యలను సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తానని హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ అన్నారు. సోమవారం రాంరెడ్డినగర్ లో కార్పొరేటర్ విస్తృతంగా పర్యటించారు. స్థానికులు మంచి నీటి సమస్య ఉందని తెలపడంతో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి సమస్యను చర్చించి వెటనె పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మురుగునీరు సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎఈ. సత్యనారాయణ ,జంగయ్య, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి,సినియర్ నాయకులు పెంటవల్లి వెంకన్న, స్థానికులు రాములు, స్వామి, శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ రాము, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి