34.7 C
Hyderabad
May 5, 2024 00: 52 AM
Slider కర్నూలు

భద్రాచలం మాకు అప్పగించి మాట్లాడు కేసీఆర్

#Shri Somuveerraju

భద్రాచలం రాముల వారి ని ఆంధ్రప్రదేశ్ కి అప్పచెప్పి అప్పుడు రాజకీయాలు మాట్లాడాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు కెసిఆర్ ను హెచ్చరించారు. కర్నూలు లో తనను కలిసిన మీడియాతో సోము వీర్రాజు మాట్లాడుతూ టిఆర్ఎస్ కి విఆర్ ఎస్ ఇచ్చి బిఆర్ ఎస్ అంటూ కేసీఆర్ పగటి కలలు కంటున్నారని వ్యంగ్యోత్తులు విసిరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో అడ్డుపడి కేసీఆర్ ఆంధ్రా అంటూ రాజకీయ కూని రాగాలు తీయడం ఏంటని ప్రశ్నించారు.

ప్రాంతీయ వాదం తో ఉన్మాది లా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ సమస్యలు పై మాట్లాడ్డానికి సిగ్గుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలు సమావేశాలు పై వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేం రోడ్లు పై పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ సభలు,సమావేశాలు నియంత్రణ చేస్తూ తీసుకుని వచ్చిన జీవో పబ్లిక్ డొమైన్ లో ఎందుకు అప్ లోడ్ చేయలేదన్నారు.

ఈ కారణంగా ప్రభుత్వ కోణం పై అనుమానాలు వస్తున్నాయి అన్నారు. రాజకీయ సభల్లో వరుసగా సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకున్న దుర్ఘటనకు కారణాలు అన్వేషణ చేయాలన్నారు. ఈ తరహా సంఘటనలు జరగకుండా చేయడానికి అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు ఏంటన్నారు.

Related posts

కరోనాతో శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు మృతి

Satyam NEWS

విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించిన ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి

Satyam NEWS

విన్నింగ్ హార్స్: ఒలింపిక్ అయేసియేషన్ కు జయేష్ రంజన్

Satyam NEWS

Leave a Comment