శ్రీశ్రీశ్రీ మహంకాళేశ్వర దేవాలయం ఆధ్వర్యంలో విజయవాడ దుర్గామాత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, ఘట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయినారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దుర్గాదేవిని వేడుకోన్నామని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ దుర్గామాతకు బంగారు బోనాన్ని సమర్పించడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగా డప్పులు వాయిద్యాలతో పెద్ద ఎత్తున కళాకారులతో విజయవాడ సిటీలో ఊరేగింపుగా వెళ్లి బంగారు బోనాన్ని సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ మెంబర్ ముత్యాలు యాదవ్ నాయకులు పెద్ద ఎత్తున తెలంగాణ భక్తులు పాల్గొన్నారు.