38.2 C
Hyderabad
May 1, 2024 19: 26 PM
Slider శ్రీకాకుళం

ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి

#Ramanujan Jayanti

పాత్రునివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కరణం శ్రీహరి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల గణిత ఉపాధ్యాయులు మరియు ప్రధానో పాధ్యాయులు ఐ.డి.వి ప్రసాద్ మాట్లాడుతూ అన్ని సబ్జెక్టులకు గణితం రాణి వంటిదని ప్రతి ఒక్క విద్యార్థి చిన్నప్పటి నుంచే గణితం పట్ల ఆసక్తి పెంచుకొని ప్రశ్నించే స్థాయికి రావాలని అన్నారు.

మరొక గణిత ఉపాధ్యాయిని పొన్నాన ఉషారాణి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ పేద కుటుంబంలో పుట్టినప్పటికీ చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని ముఖ్యంగా గణితంపై మక్కువ పెంచుకొని సంఖ్యా శాస్త్రం, అవిరామ భిన్నాలు మొదలుగా అంశాలపై పట్టు సాధించారని విద్యార్థులు కూడా గణితం పట్ల శ్రద్ధ చూపాలని అన్నారు.

ఈ సందర్భంగా గణితములో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బలివాడ ప్రభాకర్ రావు, బుడుమూరు అప్పలనాయుడు, పిసిని వసంతరావు సంపతిరావు రమణమ్మ కొణపల శ్రీనివాసరావు, సి .ఆర్. పి పంచి రెడ్డి మోహనరావు , తంగి పద్మావతి, బొంగు వెంకటరమణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

భారత్ అమెరికన్ క్రియేషన్స్ బహు భాషా చిత్రం “భారతీయన్స్”

Bhavani

అధైర్య పడవద్దు అండగా నేనున్నాను

Satyam NEWS

కాసుల కక్కుర్తి తో నరకం చూపిస్తున్న వ్యవస్థ

Satyam NEWS

Leave a Comment