పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, ప్రభుత్వ పరంగా అన్నివిధాలుగా ఆదుకుంటానని హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలంలోని ముంపుకు గురైన పాలకీడు, రావిపహాడ్, మహంకాళిగూడెం గ్రామాలలో శనివారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన పంట నష్టపోయిన రైతులవద్దకు వెళ్ళి పరామర్శించారు. మూసీ నది పరివారక ప్రాంతాలలో నది ప్రవాహానికి కొట్టుకు పోయిన పంట పొలాలు, బోర్లు, విద్యుత్ స్తంభాలను పరిశీలించారు.
పంట నష్ట పోయిన రైతుల వివరాలు అధికారులు నమోదు చేయాలని, ప్రభుత్వ పరంగా నష్ట నివారణ చర్యలను చేపట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ పర్యటనా కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మలిమంటి దర్గారావు, మండల ప్రధాన కార్యదర్శి యరెడ్ల సత్యనారాయణ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు వెంకట రెడ్డి,
రామచంద్ర నాయక్, ముదిరెడ్డి సైదిరెడ్డి, గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు, తదితరులు పాల్గొన్నారు.