దిశా పై జరిగిన అఘాయిత్యం చాలా బాధ కలిగించిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి హరీష్ రావు అన్నారు. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలి. మగ పిల్లలకు సంస్కారంతో కూడిన విద్య అందించాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలపై కన్నా మగ పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలి అని ఆయన కోరారు.
సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాల లో సత్య సాయి ట్రస్ట్ వారి సహకారం తో టిఫిన్ – ట్యూషన్ , వొడా ఫోన్ వారి సౌజన్యం తో విద్యార్థులకు ఎనిమియా పరీక్షల కార్యక్రమం ప్రారంభించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మగ పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయంపై నిరంతరం పర్యవేక్షించాలని తల్లిదండ్రులను కోరారు. అడపిల్లలతో పాటు అబ్బాయిలను కూడా సామాజిక స్పృహ కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.