గద్వాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గద్వాల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇసాక్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గా దేశానికి ఎన్నో సేవలు చేశారని తెలిపారు. ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాల వల్లే జమీందారు వ్యవస్థ రద్దయిందని, తద్వారా పేదలకు భూమి పంచడానికి వీలుకలిగిందని ఆయన వివరించారు. ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు చేసి దేశాన్ని ముందుకు తీసుకోపోవడానికి ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని తెలిపారు. దేశాని మేలైన పాలన ఇచ్చిన వారిలో ముందు వరుసలో ఇందిరాగాంధీ ఉంటారని ఆయన అన్నారు.
ఆ కాలంలోనే పాకిస్తాన్ మీద యుద్ధం చేసి బంగ్లాదేశ్ కి స్వతంత్రం ఇప్పిచిన ఐరన్ లేడీ ఇందిరాగాంధీ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బల్గేర నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరు బాబు, మల్దకల్ మండల అధ్యక్షులు నల్ల రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ మరియు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమల్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇలియాస్, గద్వాల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర, జిల్లా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వెంకటేష్, జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రెటరీ అడ్వకేట్ శివరాజ్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు బంగ్లా శాషా, గద్వాల్ మండల నాయకులు రఘు నాయుడు, జంగిర్ , గద్వాల్ టౌన్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బిసన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అతిక్, రాము, ఖలీల్, రమేష్, వీరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.