సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఆరోగ్య ఉప కేంద్ర వైద్య సిబ్బంది ఇంటింటికీ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా హుజూర్ నగర్ లోని వ్యవసాయ కూలీలకు వ్యాక్సిన్ అందించేందుకు పొలంబాట పట్టారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ వ్యవసాయ పనుల రోజులు కావడంతో తమ ప్రాంత పరిధి లోని వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వ్యాక్సిన్ యెక్క ఆవశ్యకతను వివరించి టీకాలు అందించామని తెలిపారు.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం, శానిటైజర్,సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలు పాటించాలని సూచించారు.
ఈ వ్యాక్సిన్ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ, యరగాని హైమ, ఆశ కార్యకర్త సావిత్రి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్