రానున్న మూడురోజులు విస్తృతంగా వర్షాలు పడనున్నయని అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను సూచించారు. శనివారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లాలో తహశీల్దార్లు, ఎం.పి.డి.ఒలు,జిల్లా అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు.
జిల్లాల్లో రానున్న మూడురోజులు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని, అంతే కాకుండా 45 కిలో మీటర్ల నుండి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేఅవకాశం ఉందని అందరూ జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే గ్రామాల్లో దండోరా వేసి లోతట్టు ప్రాంతాల ప్రజలకు, కచ్చా ఇళ్లలో ఉన్న వారికి అప్రమత్తం చేయాలన్నారు.