ములుగు పట్టణంలో ఆస్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నవరం రవికాంత్, పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు కత్తెర పల్లి భాస్కర్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి ని ప్రపంచానికి చాటిన తెలంగాణ వీరవనిత మన చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
కొంగు నడుము కట్టి విస్నురు గడిని గడగడలాడించిన ఐలమ్మ ఆశయ సాధన కు అందరూ క్రృషి చేయాలని తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర కీలకమని, చాకలి ఐలమ్మే తెలంగాణ తల్లి అని కోనియాడారు , తెలంగాణ రైతాంగ పోరాటాన్ని అమరవీరుల చరిత్రను పాఠ్య అంశంగా చేర్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్, జనసేన పార్టీ నాయకులు కొలిపాక ప్రశాంత్, రజక సంఘం నాయకులు చల్లగరుగుల రాజ్యవర్ధన్, వైనాల ఐలయ్య,చాపర్తి రాజు, బిక్షపతి, ములుకుట్ల శ్రీను, కత్తెర పల్లి విజయ్, జేఏసీ నాయకులు అంకూస్, పల్లెర్ల సతీష్, సంద బాబు, చుంచు రమేష్ సోలా రంగనాధ్, శరత్, భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.