హెల్మెట్ ధారణ..ప్రాణానికి రక్షణ అని అంటున్నారు విజయనగరం జిల్లా కేంద్రంలో నగర ట్రాఫిక్ పోలీసులు. గత వారం రోజుల నుంచీ ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు..ఎస్పీ ఆదేశాల మేరకు నగరంలో హెల్మెట్ పెట్టుకోవడంపై వాహనదారులకు అవగాహన కల్పించే చర్యలు చేపడుతున్నారు.
నగరంలో ని ప్రధాన జంక్షన్ లలో ఈ అవేర్నస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తాజాగా విజయనగరం లోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద హెల్మెట్,మాస్క్ లు పెట్టుకోవడంపై వాహనదారులకు అవగాహన ఇచ్చారు.
ఈ మేరకు సీఐ ఎర్రంనాయుడు ఆదేశాలతో ఎస్ఐ భాస్కరరావు.. మున్సిపల్ కమీషనరేట్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు. ఇక నుంచీ హెల్మెట్ పెట్టుకోకపోతే 500,మాస్క్ పెట్టుకోకపోతే 100 ఫైన్ విధించనున్నట్టు వాహనదారులను హెచ్చరించారు.