26.7 C
Hyderabad
May 3, 2024 07: 48 AM
Slider విశాఖపట్నం

నాసేన కోసం నా వంతు కార్యక్రమానికి సహకరించండి

#janasena

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన” నాసేన కోసం నావంతు కార్యక్రమం” కు ప్రతీఒక్కరూ సహకరించాలని విజయనగరం జనసేనపార్టీ సీనయర్ నాయకులు ఆదాడ మోహనరావు కోరారు. పార్టీ కార్యాలయంలో  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓసంకల్పంతో జనసేన పార్టీ స్థాపంచినప్పటినుండి తన కష్టార్జితాన్ని ధారపోసి ఇటు పార్టీని పటిష్టపరుస్తున్నారన్నారు.

అటు ప్రజలకు, రైతులకు, ఆపదలో ఉన్న జనసైనుకులకు, ప్రజలకు ఆర్థికంగా ఎంతో యెనలేని సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ భారతదేశంలో బహుజనుల ఆరాధ్య దైవమన్నారు. కాన్షీరాం తరువాత పార్టీ మరింత బలపడేందుకు, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మరింత సేవచేసెందుకు, వారిని భాగస్వామ్యం చేసేందుకు పార్టీ విరాళాన్ని కోరిన పవన్ కళ్యాణ్ కు మనమంతా అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

పదిరూపాయలనుండి ఎంతైనా జనసేన పార్టీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అయిన 7788040505 ఈనెంబర్ కు ఫోన్ పే, పేటిఎం, గూగుల్ ప్రక్రియ ద్వారా సులభంగా విరాళం అందించవచ్చని కోరారు. ఈసమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్రరాజు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.

Related posts

చాలా చోట్ల రేగిన అసమ్మతి: బాలినేనికి పెరిగిన బిపి

Satyam NEWS

టెన్త్ పరీక్షాకేంద్రాలను పరిశీలించిన అధికారులు

Satyam NEWS

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

Satyam NEWS

Leave a Comment