37.2 C
Hyderabad
April 30, 2024 11: 28 AM
Slider సినిమా

27న ఆర్.ఎమ్.ఎస్.గ్రూప్స్ కంపెనీ ప్రారంభించనున్న హీరోయిన్ పూర్ణ

#heroine purna

సినిమా పరిశ్రమకు, సినిమా ప్రియులకు మదనపల్లి సుపరిచితమే. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్య దర్శనీయ ప్రాంతాల్లో మదనపల్లి ఒకటనే విషయం తెలిసిందే. మదనపల్లిలో హార్సిలీ హిల్స్ లో వివిధ భాషలకు చెందిన సినిమాలు నిత్యం షూటింగ్ జరుపుకుంటూ ఉంటాయి.

ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మదనపల్లిలో… శరవేగంగా అభివృద్ధి చెందుతున్న “ఆర్.ఎమ్.ఎస్.గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ”… మరింతగా విస్తరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆగస్టు 27, శుక్రవారం ఉదయం ప్రముఖ హీరోయిన్ పూర్ణ  ప్రారంభిస్తున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకోనున్నారు.

వేలాదిమందికి ఉపాధి కల్పించే ఐ.టి.కంపెనీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనే అవకాశం లభించడం తనకు చాలా సంతోషాన్నిస్తోందని పూర్ణ పేర్కొన్నారు. ఆగస్టు 27, శుక్రవారం మదనపల్లి సందర్శన కోసం సన్నాహాలు చేసుకుంటున్నానని పూర్ణ తెలిపారు!!

Related posts

ఘనంగా బద్ది పోచమ్మ తల్లి జాతర

Satyam NEWS

లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకు వేళలు మార్పు

Satyam NEWS

ఇంగ్లీష్ మీడియం బోధనే ఉంటుంది…మారదు

Satyam NEWS

Leave a Comment