ఏపీలో రాబోయే ఈ రెండు ఉష్ణోగ్రతలు 43 నుంచీ 46 వరకు నమోదవుతాయని ఐఎండీ ముందు జాగ్రత్తలు చెప్పినా…వాళ్లు మాత్రం.. విధులు నిర్వర్తించడంలో వెనుకంజ వేయరు.వాళ్ల పోలీసు విభాగంలో ట్రాఫిక్ పోలీసులు. ఎవ్వరు చెప్పని..ఎంతమంది చెప్పని..ట్రాఫిక్ విధులు నిర్వర్తించడంలో వెనుకంజ వేయరు.ఈ క్రమంలో నే రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో పోలీసులు చేస్తున్న విధులలనే చెప్పాలి.
ముఖ్యంగా పోలీసు బాస్ దీపికా ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు సూచనలతో ట్రాఫిక్ సిబ్బంది మండు టెండలో కూడా విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా విజయనగరం లో ముఖ్య కూడళ్లలో రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించే యత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా న్యూపూర్ణ ,రైల్వేస్టేషన్, ఎంజీ రోడ్ ,కోట ,మూడులాంతర్లు వద్ద రోడ్ ను ఆక్రమించే కూరగాయలను అమ్మే వారిని, వెండార్స్ ను..తోపుడు బండ్లను..పుట్ పాత్ పైకి వెళ్లే యత్నం చేపట్టారు.
ఈ మేరకు ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు.. తన సిబ్బంది తో…ఆక్రమణల దారులను తొలగించే చర్యలు చేపట్టారు. ఇందుకు ముందుగానే మున్సిపల్ కార్పోరేషన్ లో ఎమ్మెల్యే కోలగట్ల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులకు పూర్తి అధికారాలను ఇస్తున్నామని…ఆక్రమణల దారులు…రోడ్ ను ఆక్రమించి అమ్మ కాలు నిర్వహిస్తే..చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. నాకు ఎవ్వరూ ఫోన్ చెయ్యరని..నేను కూడా ఫోన్ చెయ్యనని..వాహనదారులకు…రోడ్ ట్రాఫిక్ కు అడ్డుగా ఉన్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు తీసుకోవచ్చని ఎమ్మెల్యే కోలగట్ల ట్రాఫిక్ పోలీసులకు సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో నే న్యూపూర్ణ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు..సిబ్బంది క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు.