హైదరాబాద్ లోని అంబర్ పేట (హర్రస్ పెంట) హిందూ స్మశాన వాటిక చెట్లు పుట్టలతో, చెత్తా చెదారంతో నిండిపోయి కంపు కొడుతుంది. దీపావళి పండుగ సందర్భంగా నగరవాసులు ఈ స్మశానానికి వచ్చి తమ పెద్దల సమాధులకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విషయం తెలిసిన స్మశాన ప్రబంధ కమిటీ గాని, స్థానిక ప్రజా ప్రతినిధులు గాని స్మశాన వాటిక పరిసరాలను శుభ్రం చేయించలేదు. కనీసం స్మశానవాటికలో లైట్లు కూడా వెలగక అంధకారం నెలకొంది. ఈ పరిస్థితుల్లో సోమవారం సాయంత్రం దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు ఇక్కడికి వచ్చి సమాధులకు పూజలు చేయడం ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, స్మశాన ప్రబంధ కమిటీ వారు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట