లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తారా నగర్ లో నిరుపేదలకు బియ్యం, కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మియాపూర్ ఏ సి పి కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 200 మందికి సరుకులు పంపిణీ చేశారు. ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐలు వెంకటేష్, మహమ్మద్ పాషాలు కొండా విజయ్ కుమార్ తో కలసి పేదలకు నిత్యావసర వస్తువుల కిట్ లు అందచేశారు. ఈ కార్యక్రమంలో పౌండేషన్ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, నవీన్, మారం వెంకట్, శాంతి భూషణ్ రెడ్డి, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
previous post