వనపర్తి నియోజకవర్గ నేత మేఘారెడ్డితో విలేకరుల ఇండ్ల స్థలాలపై చర్చించి, వెంటనే ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి కృషి చేస్తానని తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నేత లక్కాకుల సతీష్ కుమార్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పత్రికలల్లో పని చేస్తూ ఉద్యమానికి సహకరించిన వనపర్తి విలేకరులకు అన్యాయం జరిగిందని తెలిపారు. వనపర్తిలో వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిన సీనియర్ విలేకరులకు ఇండ్ల స్థలాల కేటాయింపులో న్యాయం కాలేదని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే విలేకరులపై కక్ష సాధింపు చర్యలు తగదన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్