కడప జిల్లా రాజంపేట లో “నా ఇల్లు- నా సొంతం” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ,రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు కడపజిల్లా రాజంపేట మండలంలోని సిద్దేశ్వర ఎస్సి కాలనీ,అన్నమయ్య ఎస్టీ కాలనీ,ఇందిరా హరిజన కాలనీ,తాళ్ళపాక ఎస్టీ కాలనీలలో పర్యటించారు.
అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గృహ లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి ఇల్లు మంజూరు అయినప్పటి నుంచి ఎన్ని విడతలగా నగదు వచ్చింది మొత్తం మీద వారికి 2.25 లక్షకు ఎంత నగదు అందిందనే వివరాలు ఆరా తీశారు.
గృహ లబ్ధిదారులు అన్నమయ్య ST కాలనీలో, గ్రామాలలో కొందరిని అడగగా ఒకరికి 98 వేలు, మరొకరికి 75 వేలు,1 లక్ష 12 వేలు, 47 వేలు ఇలా పడ్డాయి అని పూర్తిగా తమకు డబ్బులు పడలేదని అన్నారు. తమకు గవర్నమెంట్ వేసిన అరకోరా డబ్బులు సరిపోక ఎండకు, వానకు ఇబ్బంది పడుతూ పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మించుకోలేక ఆపేసినట్టు వాపోయారు.
వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బత్యాల మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో గృహ లబ్ధిదారులకు ఎవ్వరికీ పూర్తిస్థాయిలో డబ్బులు అందలేదని, ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లను పూర్తి చేసి, పూర్తిస్థాయిలో గృహ లబ్ధిదారులకు డబ్బు అందజేయాలని రాజంపేట నియోజకవర్గ ప్రజల తరుపున, తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బత్యాల తో పాటు మాజీ ఎంపీటీసీ అద్దేపల్లి ప్రతాప్ రాజు, ఇడిమడకల కుమార్, అఖిల భారతీయ యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి బారతాల శ్రీధర్ బాబు యాదవ్, జనార్ధన్ రాజు, రేవూరి శివరామకృష్ణయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు.