స్టేట్ లాక్ డౌన్ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల, మంచాలకట్ట, మల్లేశ్వరం కృష్ణానది పరివాహక ప్రాంతాలలో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. సోమశిల పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకులు వస్తారని తెలిసి సిఐ వెంకట్ రెడ్డి, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
కొన్ని చోట్ల షాపులు తెరవడంతో మూసి వేయాలని చెప్పారు. కరోనా వైరస్ ప్రపంచాని వణికిస్తోంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కృష్ణానది నుండి ఆంధ్రకు మరబోట్లు నడపరాదాని బోటు యజమానులను హెచ్చరించారు.
ఆంధ్ర నుండి తెలంగాణకు, తెలంగాణ నుండి ఆంధ్రకు బోట్లు రాకుండా చూడాలని బోటు యజమానులను హెచ్చరించారు. మరబొట్లను నడపకుండా సీజ్ చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు బొట్లు నడిపితే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటకులు ఎవరు రాకుండా చూడాలని గ్రామ సర్పంచ్ కు సూచించారు.