28.7 C
Hyderabad
April 28, 2024 09: 03 AM
Slider నల్గొండ

టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి కి ఆత్మీయ సన్మానం

సూర్యాపేట హుజూర్ నగర్ పట్టణ, మండల, నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన హుజూర్ నగర్ నియోజక వర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కి టియుడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ సన్మానం చేశారు.

హుజూర్ నగర్ పట్టణం లోని కౌండిన్య ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యుడు సైదిరెడ్డి కి ఆత్మీయ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోలా నాగేశ్వరరావు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ ప్రాంత జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది జర్నలిస్టులు జర్నలిజం వృత్తిలో ఎన్నో దశాబ్దాలుగా పనిచేస్తున్నారని వారందరికీ న్యాయం జరిగేలా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉన్నారని అన్నారు.ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి కి పూలమాలలు,శాలువాలతో సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధి వర్గం పిల్లల మర్రి శ్రీనివాసు, బసవోజు శ్రీనివాస చారి,కిత రామనాథం, దేవరం వెంకటరెడ్డి,కోమరాజు అంజయ్య, ఆర్ పి,రామ్ రెడ్డి,జానీ పాషా,రాజు, శ్రీనివాసు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

సోము వీర్రాజు బృందానికి హస్తినలో అధిష్టానం షాక్

Satyam NEWS

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Satyam NEWS

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Bhavani

Leave a Comment