38.2 C
Hyderabad
April 29, 2024 12: 11 PM
Slider నల్గొండ

ఇండ్లు పూర్తి చేసి పేదలకు పంపిణీ చేయాలి

#hujurnagar

పేదలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంచాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫణిగిరి గట్టు వద్ద నిర్మాణంలో ఉన్న ఇండ్లను తక్షణమే పూర్తి చేసి పేదలకు పంపిణీ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

గత ఎనిమిది సంవత్సరాలుగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయకుండా కాలయాపన చేయడం సరైన విధానం కాదని అన్నారు. ఎన్ ఎస్ పి కాల్వకట్ట బాధితులు, మిర్యాలగూడ రోడ్డు, కోదాడ రోడ్డు లోని ఎంతోమంది బడుగు జీవులు ఇళ్ళు లేక రోడ్ల వెంట జీవిస్తున్నారని అన్నారు. పట్టణంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో యల్లావుల రాములు,గుండు వెంకటేశ్వర్లు,జక్కుల రమణ,మంగయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్వచ్ఛత పక్షోత్సవాలు

Satyam NEWS

కాజ్ ఆఫ్ డెత్ :నాతల్లి మరణానికి జాతీయ రహదారుల సంస్థే కారణమం

Satyam NEWS

పెట్రో ధరపై నరసరావుపేటలో ఎంఐఎం వినూత్న నిరసన

Satyam NEWS

Leave a Comment