సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యాండ్ వాష్ పై విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు ఎం.ఉదయశ్రీ అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ మండల పరిషత్ అధ్యక్షుడు గూడెపు శ్రీనివాస్, మండల అభివృద్ధి అధికారి టి.శాంతాకుమారి పాల్గొని విద్యార్థులకు హ్యాండ్ వాష్, కోవిడ్ నియమ నిబంధనల గూర్చి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు టి.శ్రీనివాస్,ఎల్.శ్రీనివాసరెడ్డి,ఎం.ప్రసన్న, వై.ఉపేందర్, పి.దీనారాణి, కె.శేషగిరి, కె.వెంకటేశ్వర్లు, సిహచ్.అశ్విని,డి.జనార్ధన్ రెడ్డి,ఎం.వసంతరావు,సిహెచ్.రవీందర్ రెడ్డి,అరుణ రాణి,బి.కవిత,అశోక్ కుమార్, విద్యార్ధులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్