కర్ణాటక రాష్ట్రం హుబ్లీకి చెందిన చిత్రకారుడు హెచ్ఎం ఆనంద్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీద అభిమానంతో ఆయన చిత్రపటాన్ని చిత్రించారు. సోమవారం నియోజకవర్గంలోని మంత్రి కార్యాలయంలో ఆయనకు బహూకరించారు. ఆనంద్ గీచిన చిత్రాన్ని చూసి మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి మండల అధ్యక్షులు రాయపాటి పురుషోత్తమ రావు, ఉమ్మడి జిల్లా రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి, కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, సిరిగిరి వెంకటరావు, బండి మల్లికార్జున రెడ్డి వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త రామకృష్ణ, శివాపరపు రామారావు తదితరులు ఉన్నారు.