ఆదివారం ములుగు నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూర్య సీతక్క పర్యటించనున్నారు. ములుగు మండలం జాకారం గ్రామ పంచాయతీ పరిధిలో గల గట్టమ్మ దేవాలయాన్ని ఉదయం 10 గంటలకు సందర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1:30 తాడ్వాయి మండలం లోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవత లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు జిల్లా అధికార యంత్రాంగం తో మేడారం జాతర 2024 గురించి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
previous post